AUCHITHYAM | Volume-3 | Issue-11 | October 2022 | Second Anniversary Special Issue - ISSN: 2583-4797
4. విశ్వమానవజీవనసారమే శతకసారాంశం
డా. జి. వి. ఎస్. జైపాల్ రావు
భౌతికశాస్త్ర ఉపన్యాసకులు, ప్రభుత్వ (పురుషులు) కళాశాల,
శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: 9492020115, E-Mail: gvsjayapalarao@gmail.com
ఉపోద్ఘాతం:
మానవతా విలువలు సృజించినప్పుడు సాహిత్యం కాలాన్ని ఎదుర్కొని నిలబడుతుంది. ప్రజల నాలుకల మీద సాహిత్యము నిలవడం, నిలబడటం అంత సులభం కాదు. పామర, పండిత నాల్కల మీద నడయాడే సాహిత్యం హృదయాలను కొల్లగొట్టినదే అవుతుంది. వివిధ భాషల్లో ప్రపంచం చాలా మంది కవులను, రచయితలను అందించింది. శతాబ్దాలుగా, దశాబ్దాలుగా, ఎంతోమంది రచితులు వారి వారి రచనలు విశ్వజనీయం అవటం వలనే వారు సూర్యచంద్రార్కం నిలిచారు. అనేక తరాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయే శతక పద్యాలను "ప్రజా కవి" వేమన మరియు "మహాకవి" శ్రీశ్రీలు అందించారు. ఆ శతకాలు ఇచ్చట చర్చనీయాంశంలు.మానవతా విలువలు సృజించినప్పుడు సాహిత్యం కాలాన్ని ఎదుర్కొని నిలబడుతుంది. ప్రజల నాలుకల మీద సాహిత్యము నిలవడం, నిలబడటం అంత సులభం కాదు. పామర, పండిత నాల్కల మీద నడయాడే సాహిత్యం హృదయాలను కొల్లగొట్టినదే అవుతుంది. వివిధ భాషల్లో ప్రపంచం చాలా మంది కవులను, రచయితలను అందించింది. శతాబ్దాలుగా, దశాబ్దాలుగా, ఎంతోమంది రచితులు వారి వారి రచనలు విశ్వజనీయం అవటం వలనే వారు సూర్యచంద్రార్కం నిలిచారు. అనేక తరాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయే శతక పద్యాలను " ప్రజా కవి " వేమన మరియు" మహాకవి " శ్రీశ్రీలు అందించారు. ఆ శతకాలు ఇచ్చట చర్చనీయాంశంలు.
శతకలక్షణాలు:
తెలుగు శతకములలో పాటించబడిన లక్షణాలను క్రింది విధముగా పేర్కొనవచ్చును.1) సంఖ్యా నియమం, 2) మకుట నియమం, 3) చందో నియమం, 4) రసనీయమం, 5) ఆత్మాశ్రయ కవితాధర్మం. తెలుగు శతకమునకు మకుటము ప్రధాన లక్షణం. సంస్కృత, ప్రాకృత వజ్ఞయ ప్రక్రియకు ప్రతిబింబమై విశిష్ట లక్షణాలతో భాషించినది ఆంధ్ర శతక ప్రక్రియ. మొదట ఆరవ శతాబ్దంలో భామహుడు, ఏడవ శతాబ్దంలో ఆచార్య దండి, ఎనిమిదో శతాబ్దంలో వామనుడు, తొమ్మిదో శతాబ్దంలో ఆనంద వర్ధనుడు, 12వ శతాబ్దంలో హేమచంద్రుడు, 13వ శతాబ్దంలో వాగభటుడు, 14వ శతాబ్దంలో విద్యానాథుడు, శతక పద్యాలను రచించినారు. 13వ శతాబ్దంలో భీమన రచించిన "కవి జనాశ్రయము", 14వ శతాబ్దంలో విన్నకోట పెద్దన రచించిన " కావ్యాలంకారచూడామణి", 17వ శతాబ్దంలో "అప్పకవి" రచించిన "శివ తత్వసార" "సర్వేశ్వరాది " మున్నగు శతకాలు రచించబడున్నాయి. మానవతా విలువల ప్రాతిపదికనే శతక రచనల న్నియు సాగినాయి.
శతకవైశిష్ట్యం:
శతక ప్రక్రియ గూర్చి, విశిష్టములైన శతకములు గురించి శ్రీ కొమ్మరాజు లక్ష్మణరావు, రాళ్లపల్లి అనంత శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి ప్రభుతులు విఫలమైన పీఠికలు, పరిశోధనా వ్యాసంలో రచించి శతక వాజ్ఞయ వైశిష్యమును నిరూపించి ఉన్నారు. తెలుగు శతకములలో విశిష్టములైన కొన్ని శతకములు వివిధ భాషల్లో పరివర్తనము (translate) చెందినవి. తెలుగు శతక ప్రక్రియ విశిష్టతతో పరిపుష్టమవడమే కాకుండా, విశ్వజనీయమైనది. వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు మొదలగు వాటిలో వివరింపబడిన విభిన్న తాత్విక దృక్పదములు అన్నింటి సారాంశమును శతక రూపంలో వివరించబడినది. పార్శ్వాలను, విభిన్న దృక్కోణములను సృశించి సరళ భాషలో శతకవేదమును ఎందరో కవులు సృజించినారు. వేమన, సుమతి, భాస్కర, శ్రీకృష్ణ, కుమార, దాశరధి, శ్రీ శ్రీ మొదలగువారు శతక రూపంలో, సిద్ధాంతపరంగా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసినారు.
జనజీవనంలోని లౌకికాంశాములన్నింటిని, కవిత వస్తువుగా గ్రహించి, సమ సమాజ భావనలకు అంకురార్పణ చేసి, జీవనగమున సారాన్ని శతకముల ద్వారా విస్తృతపరిచినాడు వేమన. వేమన పద్యాలు 300 సంవత్సరంలో ప్రజలే బ్రతికించుకున్నారనటంలో సందేహం లేదు. 300 సంవత్సరాలు తదుపరి C. P. బ్రౌన్ అన్ని పద్యాలను ప్రజల నుండి సంగ్రహించినాడు. మానవ హృదయాలను సృజించడమే కాకుండా మానవతా విలువలు ప్రాతిపదికన ఏ కాలంలోనైనా జీవిత గమనాలను ప్రతిపాదిస్తాయి. ఈ శతక పద్యాలు సంఘజీవిగా మానవుడు ఎలాగ మెలగాలో సభ్య సమాజంలో ఎలా ప్రవర్తించాలో ప్రజలతో ఎలా, ఎందుకు సమ్మిళితం కావాలో వేమా శతక పద్యాలు చెప్పాయి. కనుకనే ప్రజల నాలుకల మీద శతాబ్దాలు నిలిచాయి.సమాజ హితం కోరి, సంక్షేమం దృష్ట్యా ప్రజా సేకరణ కఠిన తరమైనా సంకలనం చేసిన ఘనత సిపి బ్రౌన్ దే. తదుపరి ఇంగ్లీషులోనికి అనువదించి విశ్వదాభిరామన విశ్వజనితం చేసినారు. ఇంగ్లీషులోనే కాకుండా సుమారు పది భాషల్లోనికి వేమన శతకాలు అనువదించబడ్డాయి.
వేమన శతకం:
జీవన సన్మార్గ విధానం, మానవతా విలువలు, సమాజ సంక్షేమం, సరళ భాషలో శతక పద్యాలు రూపంలో తెలుగు సాహిత్యంలో ప్రతిబింబిస్తాయి. విశ్వమానవసౌభ్రాతృత్వం కొరకు ఏ విధమైన సమస్యలను ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా ఎదుర్కోవాలంటే, విశాల దృక్పథం, కృత నిశ్చయం, ఆత్మాభిమానం, మానవ విలువలు పట్ల సానుకూలత ఉండాలన్నదే వేమన వేదం.
అల్పబుద్ధివాని కధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
జెప్పు తినెడి కుక్క చెఱకు తీ పెరుగునా?
ఏ రాజ్యంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా సూక్ష్మ బుద్ధి కలవాడు అధికారంలోనికి వస్తే మిడిసి పాటుతో చెలరేగి ఉత్తమములైన వారిని అవమానించి, దూరంగా తరిమి వేస్తాడట. అల్పుల స్వభావమే అంత! వాళ్ల స్వభావము కుక్క స్వభావం వంటిది. దానికి చెప్పు రుచిస్తుంది కానీ చెఱకు కాదు అంటాడు వేమన. ఏ కాలంలోనైనా మానవ హక్కులు కల రాస్తే ప్రజలు వ్యతిరేకంగా పోరు సలపాలి. విశాల దృక్పధం గల నాయకులను ప్రజలు ఎన్నుకోవాలి . మానవతా విలువలను కాపాడుకుంటూ పరస్పరం గౌరవించుకోవాలని తెలియజేసే ప్రయత్నమే ఇది.
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను,
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
ఎదుటివారి పట్ల సూక్ష్మ దృష్టితో, కుశాగ్ర బుద్ధి గలవాడగు వాడు ఎప్పుడూ తన గొప్పలు చెప్పుకుంటాడు. సద్భుద్ది కలవాడు, సకాలంలో సమదృష్టిలో తను చెప్పదలుచుకున్నది చల్లగా చెబుతాడు. రంగు ఒకే విధముగా నన్నును కంచు మ్రో గునట్లు బంగారము మ్రోగదు కదా! మానవుడు తన స్థాయిలో ప్రవర్తించవలసిన తీరు, మాటలు కట్టిపెట్టి పనులు చేసి సూచించాలని ఉద్భవించాడు.
"తప్పులెన్ను వారు తండోప తండంబు
లుర్వి జనుల కెల్ల నుండు తప్పు
తప్పు లేన్ను వారు తమ తప్పు లేఱంగరా"
విశ్వంలో మానవుడు తెలుసి కొన్ని, తెలియక కొన్ని తప్పులను చేయవచ్చు. కాని కొంతమంది అదేపనిగా ఎదుటివారి తప్పులనే సూచిస్తారు, కానీ వారు తప్పులను వారు తెలుసుకోలేరు. మనం ఈ కాలంలో పొలిటికల్ మీడియా చూస్తే వారిని వీరు, వీరిని వారు ప్రశ్నలు సంధించి తప్పులను ఎత్తి చూపుతారు. కానీ వారి తప్పులు మరుగున పడిపోతాయి అని అనుకోవడం అవివేకమే అవుతుంది.
సిరిసిరిమువ్వా శతకం:
ఈ దేశంలో, ఈ కాలంలో, ఈ పరిస్థితులను బట్టి ఇప్పుడు జనం కోసమే వ్రాసినట్టు ఉన్నది ఈ వేమన పద్యం. ఈ కాలంలో సరిపడినట్లు ఏ కాలంలోనైనా సరిపోతాయి. అదే వేమన శతకం గొప్పతనం. నీకు ఒక సిగరెట్ ఇస్తా నాకు ఒక శతకము నిమ్ము అని చక్రపాణి గారు అడుగుగా శ్రీశ్రీ " సిరిసిరిమువ్వ " శతకమును రాయుటకు పూనుకున్నారు. తెనాలి రామకృష్ణుడు, కవి చౌడప్ప, జగ్గకవి మొదలగు సుప్రసిద్ధ రచయితలు సృష్టించిన సజీవ పాత్రలను, గిరీశం, జంఝాలా ల శాస్త్రి వంటి వారిని ప్రస్తుతించి జల సూత్రం, దేవులపల్లి, తిరుపతి వెంకట కవులు, మొదలగు వారిని కీర్తించి, చౌకబారు కవులను తూలనాడి, ప్రభంద ప్రక్రియను హేళనప్రాయముగా 17 భాగములతో "సిరిసిరిమువ్వ" వ్రాయడం జరిగినది.
యతి మైత్రితో అతి నవ్యమైన, చమత్కారము పాటించి నూతన ప్రయోగం చేసి శ్రీశ్రీ సిరిసిరిమువ్వను రచించెను. వ్యవహారికభాషలో రచించి తన సంకల్పన సిద్ధించుకున్నారు. తెలుగు శతకములు కంఠస్థము సుపరిచతములయి బహుళ ప్రచారం పొందినవి. శ్రీ శ్రీ రచనలలోని అన్ని ప్రక్రియలు, అన్ని ప్రయోగంలో చేసిన మహాకవి. శ్రీశ్రీ గురించి చెప్పడానికి నా దగ్గర కొలబద్ద, "లేకపోయినప్పటికీ" సిరిసిరిమువ్వ "శతక పద్యాలు 1946, 1947 ప్రాంతంలో వ్రాసినప్పటికీ ప్రస్తుత సమకాలీన పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉన్నాయని మాత్రం చెప్పగలను. ఎప్పుడు ఆయా కాల పరిమితులలో ఆయా సమాజమనుగడకు ధీటుగా ఉంటాయి. యువ భారతి వారి రమణీయ వ్యాఖ్యలతో, ఆరుద్ర గారి వ్యా ఙ్మయము, బాపు చిత్రాలతో "సిప్రాలి" పుస్తకాన్ని యువభారతి వారు ముద్రించినారు. గత శతాబ్దంలో చెప్పుకోదగ్గ శతక పద్యాలు "సిరిసిరిమువ్వ "అనే ముగింపు, వ్యాఖ్యను శ్రీ శ్రీ స్వయంగా చెప్పుకున్నారు.
పాతబడి కుళ్లిపోయిన
నీతులు నే పట్టుకొని మనిషీలమంటూ
నూతన జీవిత లహరికి
సేతువు నిర్మింతురేల? సిరిసిరిమువ్వా?
భూస్వామిక, ధనస్వామిక, నియంతృత్వ రాజ్యాలలో ప్రజలకు చెప్పే నీతులను, బాధితుల జీవన విధి చిత్రాలను ఉప వలయాల్లో నిర్దేశించిన తీరు నుండి మార్పు చెందక, పాలకులు లేదా పెద్ద మనుషులుగా మారి ప్రస్తుత వ్యవస్థలలో కూడా చలామణి అవుతున్నారు. భావాలు మార్చుకోకుండా నూతనంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా మార్పులను అవగతం చేసుకోకుండా, అవగాహనకు రాకుండా నూతన జీవన విధానాలను నాయకులు ఎలా అవలంబిస్తారు?
తలకాయలు తమ తమ జే
బుల లోపల దాచుకొనుచు పోలింగుకుపో
వలసిన రోజులు వస్తే
సెలవింక డెమోక్రసీకి సిరిసిరిమువ్వా!
1946 ఫిబ్రవరిలో స్వాతంత్రం రాకముందు లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామ్యతంగా నవభారతాన్ని నిర్మిద్దాం అనుకున్న పరిస్థితుల్లోనే ప్రజాస్వామ్య వ్యవస్థ దారి తప్పే అవకాశాలను ముందుగా ఊహించి నేటి పరిస్థితులను అద్దం పట్టే విధంగా ఉండే పై శతక పద్యాన్ని రాయటం, వ్యవస్థల పట్ల ముందుచూపు, శ్రీ శ్రీ కె చెల్లింది. ఎన్నికల వెంటనే హింస గురించి, బలవంతపు ఏకగ్రీవాల గురించి, మద్యం, డబ్బు పంపిణీకి సంబంధించిన లాలూచీలు గురించి ఆనాడు ఊహించు వ్రాసినా, ఈనాడు అనేక రాష్ట్రాల పరిస్థితులు మనం మాధ్యమాలలో చూస్తున్నాం.
ఎన్నికలకు నిలుచుంటే
తన్నేదిరించిన సమస్త తదితరులు పయిన్
మన్నెత్తి పోయి వీరుని చె
న్నవ్వడు పొగడ గలడు సిరిసిరిమువ్వా!
దోచేసే వాళ్లను ఏదో చేస్తుందని శివాసతో చూస్తుంటేదోచేస్తుంది కదాకంచే చేను మేసినట్టు లీ ప్రభూతాజరూ! కర్ర పెత్తందారుల నుండి, ఫ్యాక్షనిస్టుల నుండి, అధికార మధాందుల నుండి, బెదిరింపులు, భయాందోళనల పరిస్థితులు కల్పించబడి స్వేచ్ఛగా వ్యక్తిగత అభిప్రాయం మేరకు ఓటు వేయలేని పరిస్థితి ఉంటే, అత్యున్నతమైన రాజ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం మెరుగైనప్పటికీ సెలవింకి డెమోక్రసీకి, అంటాడు శ్రీశ్రీ. ప్రస్తుత రాజకీయ పరిణామాలను ప్రతిబింబించే విధంగా నున్న ఈ పద్యాలు రాజకీయ నాయకులలోనున్న అనేక అవలక్షణాలలో ముఖ్యంగా అవినీతి, బంధు ప్రీతి గలవారుగా మారి దోచేస్తున్నారని, వారి అవినీతిని వెలికి తీయడానికి అనేక కేంద్ర రాష్ట్ర ఇన్వెస్టిగేషన్ సంస్థలున్నా, ఆరోపణలే తప్ప రుజువయి శిక్ష పడే దాఖలాలు లేవంటే, కంచె చేను మేసే అవకాశం ఉందని పొన్నూరు 46లో భవిష్యత్తును సమాజ పెడధోరలను గురించి నిర్మో మాటంగా చెప్పినవాడు శ్రీశ్రీ.
భోశాణప్పెట్టెల్లో
ఘోషా స్త్రీలను బిగించి గొల్లెం వేస్తూ
భేష్ బలీ బీగాలని
స్లాగ్గంచెను సాయి బోకడు సిరిసిరిమువ్వా!
ప్రస్తుత రోజుల్లో గృహహింస గురించి, గ్యాంగ్ రేపులు, విడాకులు, మతాచారాల పేరుతో కుటుంబ ఆంక్షలు, లేని సమస్యలను బలవంతంగా రుద్దుతూ మహిళలకు స్వేచ్ఛ లేకుండా చేయడమే కాకుండా మహిళ హక్కులు కాలరాయడాన్ని ఆనాడు నిరసించాడు . రాజ్యాంగ నియమాలను, మతాల బురఖాల నుండి కాపాడుకోకపోవడం వలన ' మనీలా', త్రిపుల్ తలాకులను చూస్తున్నాము.- శ్రీ శ్రీ దర్శిని కథకు భావ స్వేచ్ఛకు ఈ పద్యం నిదర్శనం.
ముగింపు:
సరళ భాషలో వ్రాయబడిన తెలుగు శతక పద్యాలు ప్రపంచమంతా ప్రాచుర్యం పొందాయి. సామాన్య జన హృదయాలను చేరువటమే కాకుండా మన జీవనాలను అనునిత్యం ప్రభావితం చేస్తూ, భావోద్వేగాలను తట్టి లేపుతూ, మానవతావులను ప్రోదు చేస్తూ, ఆర్ చంద్ర తారార్కం నిలిచే విధంగా శతకాలు వెలుగొందడం వల్లనే, ప్రజా కవిగా, మహాకవిగా అత్యంత ప్రాచుర్యం పొందినారు.
ఉపయుక్త గ్రంధాలు :
1. గోపాలకృష్ణ, కె. (1976). ఆంధ్ర సాహితీ వికాసం, ఆంధ్ర సారస్వత పరిషత్, హైదరాబాద్.
2. ఆరుద్ర, వేమన వేదం, యువ భారతి పబ్లిషర్స్, హైదరాబాద్
3. (2010). శ్రీశ్రీ ప్రస్థాన త్రయం, మనసు ఫౌండేషన్.
4. (1949). వేమన శతకం - టీకా తాత్పర్య సహితం, వెంకట్రామా అండ్ కో పబ్లిషర్స్, విజయవాడ.