AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-5 | May 2022

3. తెలుగు వార్త ఛానళ్లలో జర్నలిస్టుల పరిస్థితులు

Shaik Mohammad Shameer,

Visiting fellow & Broadcast journalist, Ph: 9573678870, smd.shameer@gmail.com

Prof. V. Sathi Reddy,

Department of Communication and Journalism, Potti Sreeramulu Telugu University, Hyderabad.


ఉపొద్ఘాతం:

టెలివిజలన్ దృశ్య శ్రవణ మాధ్యమం. భారత దేశం, ప్రపంచంలోనే అత్యధిక చానల్స్ గల దేశంగా ఎదుగుతుంది. చానల్స్ మధ్య పోటీ పెరిగి ఆదాయ వనరులు తగ్గుముఖం పట్టాయి. ఆదాయ వనరులను పెంచుకుంటూ ఖర్చులను తగ్గించే ప్రక్రియను చానల్స్ ల యాజమన్యాలు పునుకున్నాయి. తదునుగునంగా ఒక జర్నలిస్టుతో వివిధ ప్లాట్ ఫామ్ లకు ఉపయోగ పడే కంటెంటు ను రూపొందించాలని ఒత్తిడిని పెంచారు. ఇటు వాణిజ్య విభాగం నుంచి, అటు రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపధ్యంలో న్యూస్ కంటెంటు మీద విశ్వశనీయత తగ్గుతున్నది. ఇటువంటి పరిస్థితులు నెలకొన్న తరుణంలో టెలివిన్ లో పని చేస్తున్న జర్నలిస్టు పరిస్థితులను ఆద్యాయనం చేయటానికి నిర్మాణాత్మక ప్రశ్నపత్రం తో 53 విభాగాలపై 202 మంది జర్నలిస్టుల నుండి సమాచారం సేకరిచండం జరిగింది. తక్కువ జీతం,ఎక్కువ పని ఒత్తిడి,నిర్ణీత పని సమయం లేకపోవడం కారణాల చేత సుమారు 50 శాతం మంది జర్నలిజం వృత్తి ని పదవి విరమణ వయస్సు కంటే ముందు మానేస్తామని వెల్లడించడం జరిగింది.

ప్రపంచీకరణ, సాటిలైట్ టెక్నాలిజీ పెరగడం, 1995లో సుప్రీం కోర్టు వాయు తరంగాలు ప్రజల సొత్తని కీలక తీర్పు, ఇండియా నుంచే చానల్స్ ల ఆప్లింక్ మరియు డౌన్లింక్ సౌలబ్యంతో చానళ్ల ప్రసారాలు మెదలయ్యాయి. చానల్స్ పెరగడం తో ఉపాధి ఆవకాశాలు గననీయంగా పెరగాయి. రూపార్టు మూద్రాక్ అద్వర్యంలో ఎన్డీటీవీ సౌజన్యంతో స్టార్ ప్లస్ న్యూస్ చానల్ ప్రారంభించడం అకశ్మికంగా చోటు చేసుకుంది (మోహాతా,2008). తర్వాత ఆజ్ తక్,జీటీవీ లు ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం భారత దేశంలో మెత్తం 877 సాటిలైట్ చానల్స్ ఉన్నాయి. ఇందులో 389 న్యూస్ చానల్స్ అందుబాటు లో ఉన్నాయి. దూర్ దర్శన్ అద్వర్యంలో దాదాపు 35 చానల్స్ ప్రసారమౌతున్నాయి.

జర్నలిజం ఒక పవిత్ర వృత్తి మరియు సమాజ అభివృద్దిలో జర్నలిజం కీలక పాత్రం పొషిస్తుంది. ప్రజాసామ్యం లో ప్రెస్ కు ప్రత్యేక గౌరవం ఇవ్వడం జరిగింది. ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా వ్యవహరిస్తూ ఆవసమైనపుడు ప్రతి పక్ష పాత్రను పోషిస్తుంది. టీవీ స్టూడియోలు ఒక కొత్త సంక్షోభాన్ని సృష్టించాయి. ఎడిటర్లు జర్నలిజం నైతిక విలువలను మరిచిపోయి, బహిరంగంగానే అధికార కేంద్రాలకు సాగిలపడితే.. అది పెను సంక్షోభంగా రూపాంతరం చెందుతుంది. ఈ కొత్త ఈకో సిస్టమ్ లో ఇండియన్ మీడియా ముఖ్యంగా టీవీ జర్నలిజం కొత్త గ్రామర్ ను అద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నది. కొందరు సంప్రదాయ జర్నలిస్టు గురువులు చెప్తున్నట్టు.. గత కొన్నేళ్లుగా టీవీలో ఒక్కటి కూడా నిష్పాక్షికమైన వార్త రావడం లేదు. క్లాసికల్ న్యూస్ రిపోర్టింగ్ జవసత్వాలు ఉడిగిపోయింది.అన్నింటికన్నా ఇప్పుడు సోషల్ మీడియాదే హవా. ఒక ఎడిటర్ కన్నా సోషల్ మీడియానే వేగంగా పనిచేస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియా రిపోర్టర్ కూడా ఒక ఎడిటరే. అందునా ఫలానా వార్తలే కవర్ చేయాలన్న రూల్సేం లేవు. ఛానళ్లలా గైడ్ లైన్స్ కూడా ఉండవు. సోషల్ మీడియాను అడ్డుకునే వాళ్లు లేరు. స్వేచ్ఛగా అభిప్రాయాలను పంచుకోవచ్చు. కాబట్టి సోషల్ మీడియా విప్లవం నుంచి ఎలక్ట్రానిక్ మీడియా తన ఉనికిని కాపాడుకునే పరిస్థితి వచ్చింది. టీవీ జర్నలిస్టులుగా పని చేస్తున్న వ్యక్తి టెలివిజన్ తో పాటు వెబ్ కంటెంటు, విడియో ఎడిటింగ్, కామెరా ఆపరేషన్ చేయవలసివస్తుంది.

జర్నలిస్టుల పరిస్ధితి:

కమీటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్టు(సీపీజే) నివేధిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 1305 మంది,ఇండియాలో 47 మంది జర్నలిస్టులు హత్య కు గురి కావడం జరిగింది. సంవత్సరం 1993 లో మీడియా లో కాంట్రాక్టు పద్దతి ప్రారంభం కావడం తో జర్నలిస్టులు ఆశించిన వేతనాలను డిమాండు చేయడం తగ్గింది (దేశాయి, 2017). జర్నలిస్టు ల పరిస్ధితులు మాత్రం మారలేదు. ప్రస్తుతం ఎడిటర్/రిపొర్టర్ పరిస్థితి యాజమాన్యం కు అనుకూలంగా ఉంటూ ఇటు రాజకీయ పార్టీ నేతలతో సఖ్యతగా మెలుగుతూ అటు ఆర్ధిక వనరులను పెంచె పబ్లిక్ రలేషన్ ఆఫీసర్ గా మారడం జరుగుతుంది (భారత్ భూషన్, 2015).

వేజ్ బోర్డు ప్రతి పాధించిన వేతనాలు న్యూస్ పేపర్లలో పని చేస్తున్న జర్నలిస్టుల కు మత్రమే వర్తిస్తాయి (ఎబిపి కేస్,2011). ఇంతకు మునుపు చేసిన పరిశోధనలు ప్రింట్ మీడియా జర్నలిస్టుల పై మాత్రమే ఉన్నాయి(చిత్తామని 2013, సత్తిరెడ్డి 2005,నీరజ్ 2009, మధు 2018). ఉద్యోగ అభద్రత జర్నలిస్టులను కలవరపరుస్తుంది. ఎక్స్ ప్రెస్ టీవీ,6 టీవీ, రాయుడి టీవీ, ఏ టీవీ మూత పడ్డాయి. చాలా చానల్స్ లో జీతం సకాలంలో ఇవ్వడం లేదు. టాప్ టెన్ లో ఉన్న చానల్స్ కాస్ట్ కటింగ్ లో భాగంగా ఉద్యోగస్తులను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న చాలా తెలుగు చానల్స్ shops and establishment చట్టం క్రింద రిజిస్ట్రర్ చేసుకున్నాయి.ఫ్రింట్ మీడియా జర్నలిస్టులకు సంబంధించిన వేజ్ బోర్డు ప్రతిపాదనలు ఎలక్ట్రానిక్ మీడియా లో పని చేస్తున్న జర్నలిస్టులకు వర్తించదు.

పరిశోధన విధానం:

హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న19 తెలుగు టెలివిజన్ న్యూస్ చానల్స్ లో పని చేస్తున్న జర్నలిస్టుల నుంచి సమగ్ర సమాచారం కొరకు ప్రతి చానల్ నుంచి ఒక్కొరిని రిసెర్చ్ అసిస్టెంటు ను నియమించుకొని నిర్మాణాత్మక ప్రశ్నపత్రం తో 202 మంది జర్నలిస్టుల నుంచి సమాచారం సేకరించడం జరిగింది. పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా నిర్మాణాత్మక ప్రశ్నపత్రం ను 15 మంది సీనియం జర్నలిస్టులకు చూపంచి, వారి సలహాలు, సూచన అనుకునంగా పశ్న పత్రం రూపొందించడం జరిగింది.

గత పరిశోధన వివరాలు:

వివిధ దేశాలలో జర్నలిస్టుల స్ధితిగతులు,ఒత్తిడి ప్రభావం మరియు సంతృప్తి కలిగించే అంశాలపై అధ్యాయనం చేయడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 21 శతాబ్దంలో జర్నలిజం మరియు జర్నలిస్టుల పై అధ్యాయం పుంజుకుంది.ప్రప్రధమంగా 20వ శతాబ్దంలో జర్మని, అమెరికాలో చేసిన అద్యాయాలను శాస్త్రవేత్తలు అమోదం లభించింది. ఈ అధ్యాయానాలు జర్నలిస్టుల సామాజిక అంశాలతో ప్రారంభమై,సమాచార ప్రభావం,మీడియా వ్యాపారం అంశాలపై చేయడం జరిగింది. వీవర్ మరియు విల్హట్ (1986 మరియు 2012) సర్వేలు సమాజంలో జర్నలిస్టుల మారుతున్న పాత్ర ,వారి వైఖిరి,నమ్మకాలు, కొత్త టెక్నాలజీ ప్రభావం లాంటి అంశాలపై అధ్యాయనం చేయడం జరిగింది. హనీజ్ (2009) వివిధ దేశాలో ఉన్న జర్నలిస్టుల వృత్తి నిత్యకృత్యాలు,సాంఘీకరణ, అభిప్రాయాలు,పధ్ధతుల సారూప్యతలను గుర్తిచండం జరిగింది.
ఇండియా లో మంజునాధ్(2007), ప్రెస్ ట్రస్ట్ ఆప్ ఇండియా (2005), మూర్తి మరియు అనిత (2010),దేవెందర్ (2014),అఖిలేశ్వరి (2014), మంజుల (2015),టోమర్ (2011 మరియు 2017) అధ్యాయానాలు మహిళా జర్నలిస్టుల స్థితిగుతులపై నిర్వహించడం జరిగింది. ఇంగ్లీషు పత్రికలలో పనిచేస్తున్న మహిళాల పరిస్థుతులు,ఇతర భాష పత్రిలలో ఉన్నవారి కంటే మేరుగైన విగా గుర్తించడం జరిగింది. పని కేటాయించడం విషయంలో వివక్ష కనిపించింది. జర్నలిస్టుల సామాజిక అధ్యాయనం (సత్తిరెడ్డి 2005) లో చాలా మంది జర్నలిస్టుల పని చేస్తున్న జాబ్ లో సంతృప్తికరంగా ఉన్నమని,చింతామని (2013) నిర్వహించన సర్వేలో కన్నడ జర్నలిస్టుల పరిస్థితుల దిగజారుతన్నయని,నీరజ్ (2013) అధ్యాయనంలో అంతర్జాతీయ ప్రమాణాల కంటే జర్నలిస్టుల జీతాలు తక్కువగా ఉన్నాయని,మధు మరియు మంజునాధ్ (2016) కృష్ణ జిల్లా ఫ్రింట్ మీడియా జర్నలిస్టుల పై చేసిన సర్వే లో ఉద్యోగ భద్రత, డెబ్బై శాతం మందికి అపాయింట్మెంట్ లేటర్ లేదని వెల్లడైయింది.

అధ్యయన ముఖ్యలక్ష్యాలు:

1. టెలివిజన్ జర్నలిస్టుల సామాజిక ఆర్ధిక పరిస్థితుల అధ్యాయనం
2. టెలివిజన్ జర్నలిస్టుల స్థితిగతుల అధ్యాయనం

పరిశోధన ఫలితాలు:

టెలివిజన్ జర్నలిస్టుల సగటు వయస్సు 34 సంవత్సరాలు. అత్యాధిక మంది జర్నలిస్టులు 26-35 మధ్య వయస్సుల వారిగా, హిందూ మతస్థులు, వెనుక బడిన తరగతులకు చెందిన,వివాహమై, డిగ్రీ పూర్తి చేసి,ఇద్దురు లేదా ముగ్గురు వీరి మీద ఆధారపడి, సబ్ ఎడిటర్లగా రూ.20వేల నుంచి 30వేల జీతాలు గల వారిగా ఉన్నారు. కేవలం మూడు శాతం మంది జర్నలిస్టుల జీవిత భాగస్వాములు గవర్నమెంటు ఉద్యోగస్తులు. సుమారు 19 శాతం మంది అపాంట్మెంట్ లెటర్ లేని వారిగా ఉన్నారు. దాదాపు 37 శాతం మంది జర్నలిస్టుల యునియన్ల లో సభ్యత్వం లేని వారిగా ఉన్నారు. అత్యాధిక మంది వృత్తిలో స్వయం ప్రతిపత్తి, వృత్తి నైపూణ్యం పెంపొందించటానికి ఆవకాశాలు, జీతం, ప్రజలకు ఉపయోగపడటం, ఉద్యోగ భద్రత అంశాలు చాలా ముఖ్యమైనవిగా, ఎడిటోరియల్ విధానాలు, ప్రజావ్యవహారాల ప్రభావితం చేయడం, ఇతర ఆర్ధిక ప్రయోజనాలు,సెలబ్రెటి స్టెటస్ ముఖ్యమైనవిగా వెల్లడించడం జరిగింది. తోటి ఉద్యోగస్తులతో సంబంధాలు, తామ సృజనాత్మకత ఉపయోగం, ఉద్యోగ స్వేచ్చపై సంతృప్తి వ్యక్తపరిచారు.వృత్తి లో అధిక ఒత్తడి,యాజమాన్య ధోరణి, తాము చేస్తున్న పనికి సరైన జీతం లభించడం లేదని కొంత శాతం మంది అభిప్రాయ పడ్డారు.

యాబై శాతం మంది తాము చేస్తున్న వృత్తి లో సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించారు. దాదాపు 50 శాతం మంది తమ రిటైర్మెంట్ కంటే ముందే జర్నలిజం వృత్తిని మానేస్తామని వెల్లడించడం జరిగింది.నాలుగో వంతు మంది తమ జీతాలు నిర్ణీతమైన సమయంలో రావటం లేదని ఆందోళన వ్యక్తపరిచారు. అత్యాధిక జర్నలిస్టులు ఉద్యోగ భద్రత లేకపొవడం, పై అధికారి నుంచి విమర్శాల తో ఎక్కవ ఒత్తిడికి గురవౌతున్నట్లు తెలుస్తుంది.

ముగింపు:

టెలివిజన్ చానళ్ల లో పని చేస్తున్న జర్నలిస్టుల స్థితిగతులు అధ్యయనం లో దాదాపు యాభై శాతం మంది సంతృప్తికరంగా ఉందని చెబుతుంటే మరో యాభై శాతం జర్నలిస్టులు పదవి విరమణ వయస్సు కంటే ముందే జర్నలిజం వృత్తి మానేస్తామని చెబుతున్నారు.వృత్తిలో ఒత్తిడి,యాజమాన్య శైలి,ఆశించినంత జీతం లభించడం లేదని ఆవేదన వ్యక్తపరచారు.

References:

1. Abp Pvt. Ltd. & Anr v. Union of India & Ors, 2011. Viewed 16 Jan 2019, https://indiankanoon.org/doc/55355160/

2, Ahileswari,(2016), Status of working women journalists, thesis submitted to Osmania University, Hyderabad

3. Bhardwaj, Devender-2014, Status of working women journalists in India, a study of Delhi NCR, Manav Rachna International University

4. Bhushan, B 2015, The changing structure of media and ethics in India, In Rao, S,

Wasserman, H (eds.) Media Ethics and Justice in the Age of Globalization, Palgrave, Macmillan, London.

5. Chintamani Y.V.(2013) Socio-economic Conditions of Kannada Print Journalists, Ph.D. thesis submitted to Mysore University.

6. David H. Weaver and Lars Willnat (2012), The global journalist in the 21st century, Routledge Publications, 711 Third Avenue, New York, NY 10017.

7. Desai, M 2017, ‘Journalism education in India: Maze or Mosaic?’, In R Goodman & E Steyn (eds.) Global journalism education in the 21st century: challenges and innovations, viewed 16 January 2019.

8. Doordarshan Website: DDindia.gov.in  http://www.ddindia.gov.in/AboutDD/pages/Default.aspx)

9. Machin, D., & Niblock, S. J. (2006). News Production: theory and practice. Abingdon: Routledge

10. Madhu Babu* J.Manjunath (2018), Job and Salary Satisfaction of Journalists in Telugu Press: A Survey Analysis in Andhra Pradesh Vol. 8 Issue 10, October 2018, International Journal of Research in Social Sciences.

11.Manjunath.B( 2007), Status of working women journalists in Karnataka- a study, Ph.D. thesis submitted to Karnatak University.,

12..Manjushree Ganapathy (2016), Status of working women journalists in Karnataka a comparison between print television and English Kannada media, Ph.D. thesis submitted to Manipal University

13..Ministry of Information and Broadcasting websitehttp://mib.nic.in/demo.aspx accesed on 29.5.18

14. Ranu Tomar (2017)Understanding Women Journalists’ Experiences of Working in Hindi Print Journalism in Cities of Madhya Pradesh, Ph.D. thesis submitted to Tata institute of social sciences

16. Sathi Reddy. V,(2005) Sociological study of journalists, Ph.D. thesis submitted to Karnatak University, Dharwad.

16. Staus of women journalists in the print media,(2005) Press Institute of India Report.

17. Working Journalists & other Newspaper Employees (Conditions of Service) and Miscellaneous Provisions Act, 1955 http://www.ijuindia.org/wjact.html