AUCHITHYAM | Volume-3 | Issue-8 | August 2022 | ISSN: 2583-4797
2. దేశభక్తిస్ఫూర్తి కావ్యం - ‘‘శ్రీ శివభారతం’’
కవాడపు లలిత
తెలుగు ఉపన్యాసకురాలు, సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ కళాశాల,
సుంకేసుల రోడ్డు, కర్నూలు.
చరవాణి: 9959806205, ఈ మెయిల్: lalitha.k2014@gmail.com
ఉపోద్ఘాతము:
మహాభారతము వలెనే ఈ ‘‘శివభారతము’’ కూడు ఆధర్శ నిర్మూలన చేసి,ధర్మరాజ్య స్థాపన చేయుటను ప్రబోధించునట్టిది.భారత జాతీయ స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని భారతీయులలో కలిగించే లక్ష్యంతో శ్రీ గడీయారం వెంకటేశేష శాస్త్రి గారు రచించినదే ‘‘ శ్రీ శివభారతము’’ చారిత్రక మహాకావ్యం. జాతీయత, దేశభక్తి, ప్రాచీన భారతీయ సంస్క ృతి పరిరక్షణ, స్వరాజ్యలక్ష్య సాధన, స్వరాజ్య స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి నేతjైున ‘శివాజీ’ మహత్తరధీరా, వీరగాధను శాస్త్రి గారు చారిత్రక పద్య మహాకావ్యము వేలయించి ధన్యులైనారు.
శివాజీ భారతీయులకు ఆదర్శమూర్తి పరాయి పాలనలో ఉన్నదేశాన్ని రక్షించడానికి పరిశ్రమించిన మహా మనిషి, శివాజీ ప్రజలలో జాతీయతను దేశభక్తిని రగిలించి వారిని యుద్దవీరులుగా తయారుచేసి తద్వారా స్వరాజ్య నిర్మాణం కావించడడంలో దాదోజీ ఖాండదేవుడు, సమర్ధరామదాసు బోధనలు శివాజీకి ఎంతో బలాన్ని ఇచ్చాయి.
శ్రీ గడియారం వేంకట శేషశాస్త్రిగారు ‘‘ శ్రీ శివభారతము’’ న తమ కావ్యనాయకుడైన శివాజీ ధీరోదాత్త గురుమూర్తిని గూర్చి పేర్కొనుచూ-
‘‘ ధీరాగ్రేసరమూర్తి, హైందవధరిత్రీ భాగ్య సత్యాపన
ప్రారంభుండు దయాగుణాంబుధి, మహారాష్ట్రాన్వయౌత్తంసుడౌ
వీరక్షత్రియమౌళి: దేశ,మత,గో, వేదాది రక్షితార్పిత
శ్రీ రమ్యుండు, భనానీ భక్తుడు, శివాజీరాజు సామాన్యుడే। ’’
(ఈ పద్యమునుశ్రీన ‘శివభారతం గ్రంథంలో కవిగారు మొదట శివాజీ చిత్రం కింద ముద్రించుట విశేషము).
అని శివాజీ మహోదాత్తగుణాలను, ఆదర్శ వ్యక్తిత్వ వైభవాన్ని రమణీయముగా కళ్ళకు కట్టినట్లు వర్ణించినారు. శివాజీ వంటి దేశభక్తి పూరిత, వీరులుగా, ఉత్తమగుణ సంపన్నులుగా,భావి భారత పౌరులు ఎదగాలని ఈ మహాకవి ఉన్నతాశయముగా ఈ కావ్యంలో కనిపిస్తుంది.
గురువైన దాదోజి:
గురువైన దాదోజి శివాజిని తన స్నేహితులతో కలిసి ప్రజల యోగక్షేమాలు విచారించమని పల్లెలు పట్టణాలకు పంపాడు.ధర్మ రక్షణార్థం శివాజి మవాళ వీరులకు తగిన శిక్షణ ఇచ్చాడు. పర్వత ప్రాంతంలో ఉన్న మవాళ వీరుల స్థితి గతులకు శివాజి చలించిపోయాడు.దాదోజి ఈ విషయం తెలుసుకొని తానోకందుకు పంపితే శివాజి వేరొక విధంగా కార్యసాధకుడై -నందుకు చింతించాడు. వెంటనే దాదోజి శివాజిని తిరిగిరమ్మని కబురు పంపెను.గురువాజ్ఞతో శివాజి తిరిగి వచ్చాడు. దాదోజి మందలించి హితవు చెప్పాడు. కాని శివాజి ఇలా వినయంగా తాను భోగ భాగ్యాలను కోరడంలేదని ఇతరుల అభివృద్ధిని చూసి బాధపడటంలేదని కూటికి గుడ్డకు లేని పేదలకు,నశించె మతాన్ని చూసి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాని అన్నాడు.
మ. ఒక సింహాసనమెక్కి భోగములతో నుయ్యేలలూ( గంగ( గో
రిక లే, దన్యుల వైభవంబు( గని యార్తింబొందుటా - లేరు కూ.... (2-293)
శా. నేనేకా, దొక దేశబంధు వెవ( డున్ నే( డైన రేపైన ని
ట్లే నిర్థాదణ సేయ( గావలయు( నిట్లే పోరు సాగించి దీ..... (2-294)
ఎంత కాలమని వారికి భయపడి అణిగిమణిగి ఉండి మన ప్రజలు బ్రతుకవలెను. దేశ భక్తుడేవరైనా తన లాగనే చేస్తాడన్నాడు. ఆత్మగౌరవాన్ని కోల్పోయి జీవించుట తనకు ఇష్టంలేదని స్వాధర్మ రక్షణ కోసం పరితపిస్తున్నానని శివాజి తన దృఢనిశ్చయాన్ని దాదోజికి వెళ్ళడిరచాడు.
మ. గురుజీ! నే నిటు నిశ్చయించితి.......
...దీవనలిచ్చి నన్ననుపు! నాదోసమ్ముమన్నింపుమీ! (2-303)
తే. అనెడు యువరాజు దృధనిశ్చయంబు( దెలిసి
ప్రా(త పలుకుల మరలించపరామి(దలంచి,.... (2-304)
ప్రతి మానవుడు దేశప్రజలకోసం సత్కార్యాలు చెయాలనుకున్నపుడు దృడ నిశ్చయంతో ఉండవలెను ఇది శివాజిలో చిన్న వయసులోనే కనిపించింది. ఇదే తర్వాతి కాలంలో స్వరాజ్య స్థాపనకు దృఢపరిచింది.
శివాజీ:
‘ధైర్యె సాహసే లక్ష్మీ’ అని లొకోక్తి. ధైర్యసాహసాలు ప్రదర్శించిన వ్యక్తులకు విజయలక్ష్మి చేకూరుతుంది.ధైర్యంతో వ్యక్తి తాను రక్షణ పొందడమే కాకుండ సామాజిక రక్షణ కూడ గావించాలి.అప్పుడే ధైర్యగుణానికి సార్థకత. ఈ కావ్యంలో శివాజీ ధైర్యసాహసాలు చూపిన మహావీరుడు.దేశప్రజలకు ఒక రక్షణ కవచంలా నిలిచికాపాడాడు. యుద్దాలు చేయడంలో శివాజీ ఆరితేరినవాడు.అఫ్జల్ఖాన్ వధ, సయిస్తాఖాను వధించడం మొదలైనవి శివాజీ ధైర్యసాహసాలకు ఉదాహరణలు.ఈ ధైర్యసాహసాల వలనే శత్రువుల బారినుండి అనేక దుర్గాలను స్వాధీనం చేసుకుని మాతృభూమిని రక్షించాడు.శత్రువులు కూడా శివాజీలోని ధైర్యసాహసాలను కొనియాడారు.
ఉ. ఏ(బదివేల కాల్బలము,లేచినగుఱ్ఱము ........
......మొగమ్మున దూ(కుచు,దండయాత్రలన్.... (5-4)
ఉ. తేఱిన ధీబలంబు-గడిదేఱిన బాహుబలంబు-కా(కలన్
....విహారముల్ వెలయ(గా శివరా జిటు విక్రమించెడున్ (5-5)
శివాజీని యుద్దభూమిలో చూసిన యుద్దవీరులు భయపడేవారు.బహిరంగ యుద్దంలో పోరాడడం,గుహలు,గుట్టలు చాటు చేసుకుని శత్రువులను ముట్టడిరచడం దూరం నుండి ఫిరంగులు ,బాణాలు వేస్తు శివరాజు శత్రువులను చండాడాడు.
సీ. ఇంతలో సైన్య సమేతుడై....
బహిరంగముగ(బోరె, గుహలు గుట్టలు చాటు
గొని పులివోలె గగ్గోలుపఱచె,
సంకులంబుగ దొమ్మిచఱచె,దూరము నుండి
పలుశరంబులు పిరంగులును గురిసె.... (5-192)
శివాజీ ధర్మాన్ని రక్షించడానికి ప్రాణాన్ని పనంగ పెట్టి కసాయి ఖాన్ని అంతమొందించాడు.
ఉ. జందెపు వ్రేటునన్ జొనిపి,సవ్యభుజంబుననుండి కుక్షికిన్
గ్రిందుగ దూయ(గా(దిగిచి, ప్రేవులు నెత్తురు(బాఱ(జీల్చి... (5-144)
అఫ్జల్ఖాన్ తాను అనుకున్న పథకం ప్రకారం కపట స్నేహంతో శివాజీని ఆత్మీయంగా కౌగలించుకున్నట్లుగా చేసి చివరికి కత్తితో చంపబోయాడు. శివాజీ ఖాన్ మోసాన్ని గ్రహించి పట్టును వదిలించుకొని ఎడమచేతి పులిగోర్లతో ఖాన్ పొట్టను చీల్చాడు.
భటుడైన బాజీప్రభువు :
రక్షకభటుడు అంటే జనులంరికి రక్షక కవచంలా నిలబడేవాడు.దేశరక్షణ చేయలంటే ముందు రాజును రాజ్యాన్ని కాపాడుకొవాలి.బాజి ప్రభువు అనే రక్షక భటుడు శత్రువుల బారినుండి ప్రజలను ,వారి రాజును తన ప్రాణాలొడ్డి కాపాడాడు. ఇతనిలో ఉండే మానవీయత చాలా గొప్పది. దేశంకొసం ప్రాణాలర్పించిన వీరుడు.ఖాన్ మరణం తరువాత వారి కుమారుడు సైన్యం శివాజీని వెంటాడిరది.శివాజీ అనేక దుర్గాలను జయించాడు.బీజాపుర్ సుల్తాన్ పై శివాజీ దండెత్తి వస్తున్నాడని గ్రహించి సుల్తాను యుద్దవీరులను తయారు చేశాడు.బీజాపుర్ సైన్యం పట్టుదలతో ఉండటం చూసి శివాజీ సంధిచేసుకున్నట్లు నటించి అర్దరాత్రి శివాజీ కోటను దాటాడు.అది గమనించిన ఖాన్ సైన్యం శివాజీని వెంబడిరచింది.శివాజీ బాజీ ప్రభువు యుద్దం చేయగా బాజి ప్రభువు శివాజీని రాంగణకు తిరిగి వెళ్ళమన్నాడు.అక్కడకు వెళ్ళి ఫిరంగులు మ్రోగించమన్నాడు. కాని శివాజీ బాజీ ప్రభువును ఒంటరిగా వదలడం మనసు అంగీకరించలేదు.
తే. మూ(డువందల సేనతో మోహరించి,
దశ సహస,పతాకిని దర్ప మడ(చి.... (5-228)
సీ. ద్వంద్వ యుద్ధప్రౌడిరదారసిల్లినవారి
నెదిరించి కుత్తుకల్ చిదిమివైచి,
యనువుమై(బొంచి పైకొని చుట్టుకొనువారి
గుంపుగా నడరి దూ(కుచు(బోరువారి(బె....
తే. రాహుదంష్ట్రా కరాళ శాతృవకృపాణ
పంజరము(బాయ(దట్టి యవ్వలకు నెగసి,
మొగులు(బాయి దినేశ్వరుపగిది సధిక
దీప్ర కిరణుండై తఱిమె బాజీప్రభుండు (5-238)
బాజీ ప్రభువు ప్రళయకారుడై మూడువందల సేనతో పదివేల శత్రుసైన్యాన్ని నేల- కూల్చాడు .బాజీ ప్రభువు వీరబద్రునివలె విజృంబించాడు.తన సైనికులను ఉత్సాహపరిచాడు.ఆఖరి క్షణం వరకు శత్రువులతో పోరాటం చేశాడు.రాంగణ నుండి అయిదు ఫిరంగి శబ్దములు వినబడినాయి. తన ప్రభువు క్షేమంగా చేరినట్లు తెలుసుకొని బాజీ ప్రభువు నేలకు ఒరిగిపోయాడు.
సాదువైన రామదాసును:
శివాజీ తరచు సాదువైన రామదాసును కలవడానికి వెళుతుంటాడు.ఒకసారి శివాజీ ధర్మరక్షణ కోసం పూనుకొన్న తనకు ఒక్కొక్కప్పుడు ఇది ‘క్రూరకర్మమేమో’ అనే సందేహం కలుగుతుంటుందని నేను ముందుకు వెళ్ళితే లోకం వ్యతిరేకత చూపుతుందని ఈ పరిస్థితిలో ఏంచేయాలో చెప్పమని అర్థించాడు. అప్పుడు సమర్ధరామదాసు శివాజీతో ఇలా పలికాడు.
తే. ‘‘దాన స్వార్థము(గోరు భూధవులకంటె
మునులుమేలు, వారలకంటె మొగి(బరార్ధ
సాధకులు మేలు, వారిలో జ్ఞానధనుని
కంటే రాజర్షి శాంతి రక్షకు(డు మేలు.’’ (3-211)
దుర్మార్గులైన రాజులు లోకాన్ని నాశనం చేస్తున్నప్పుడు వారిని సమర్దుడైన వాడు సహించి ఊరుకోకూడదు.అది లోకహిత యజ్ఞంగా నేను భావిస్తానన్నాడు. స్వార్థం కోసం కాక, లోకహితం కోసం చేసే హింస కూడా అహింసే అవుతుందని భవానిమాత ధర్మదండాన్నిచ్చి నిన్ను పంపినదని సంశయాన్ని వీడి ధర్మవిజయమెత్తి దేశాన్ని రక్షించమని ఎన్నో ధర్మవిషయాలను తెలిపాడు.
చ. అఱమది మాని ధర్మవిజయధ్వజ మెత్తి, పరాధికార.." (3-229)
తే. వేసముల మాఱు ధర్మజిజ్ఞాన నీకు
వలదు, వలవదు పుణ్య పాపములగొడవ:
రాచబిడ్డవు,ధర్మశస్త్రమున దున్ని
పంట గొలుపుమీ యిహ పర భాగ్యలక్ష్మి ! (3-242)
రాచబిడ్డకు వేషాములు మారే ధర్మం కలదని పాపపుణ్యాల గొడవ వదలి ధర్మశాస్త్రముతో దున్ని భాగ్యలక్ష్మి ని పండిరచమని రామదాసు తన దీవెనలు అండగా ఉంటాయని తెలిపాడు.
తానాజీ:
తానాజీ శివాజీ సర్దారులలో ప్రముఖుడు. మావాళాధిపతి దేశబక్తుడు, స్వామిభక్తి కలవాడు ‘‘ స్వర్గానికి ఈ సామ్రాజ్యం సాటియా’’ అనడంలో స్వరగం కన్నా పరమ పవిత్రమైన ఈ భారతవని పై గల దేశాభీమానం తెలుస్తుంది. కుమారుడి వివాహం సైతం లెక్కచేయకుండా యుద్దానికి వెళ్ళినాడు సింహగడ్ విజయంలో ప్రాణాలు కోల్పోయాడు తానోజి తన జీవితమంత దేశ స్వాతంత్య్రానికే ధారపోశాడు. తానాజీ తన యుద్ద జీవితంలో కాఉ ముందుకు పేటడమే కానీ, వెనకడుగు వేయడం అనేది ఎరుగడు. తానాజీ గురించి శివాజీ పలికిన పలుకులు
సీ. గుమిగొన్న రిపుల పైం.........
తే. తెఱపిగొని వింట..... (7-238)
సూర్యాజీ:
తానాజీ తమ్ముడైన సూర్యాజీలో సోదరభావం, స్వామిభక్తి, త్యాగం అనే మానవీయ విలువలు కనిపిస్తాయి. తానాజీ సింహగఢ్ దుర్గాన్ని జయించడంలో యుద్దంలో మరణించాడు. సోదరుడిని వేతుకుంటూ వచ్చిన సూర్యజీ అన్న మరణానికి తల్లడిల్లాడు. ప్రస్తుత కర్తవ్యం అన్న ప్రతిజ్ఞ సూర్యాజీకి స్ఫురించెను పారిపోతున్న భటులను చూసి తన దు:ఖాన్ని దిగమ్రింగుకొని వారిని ఉత్సాహపరిచాడు.
శా. ‘ధైర్యోత్సాహము లేపుమిఱుమగ( డై, తానాజీకిన్ దమ్ము( డై
సూర్యాజీ ప్రతిపక్షనిర్మధన సాసూయ త్వరాహంక్రియా..’ (7-269)
వీరభద్రుడు వలె విజృంభించి శత్రువులను చీల్చి చెండాడి సింహగఢ్పై హైందవ పతాకాన్ని ఎగురువేయించాడు. తానాజీ శవాన్ని చూసి శివాజీ కన్నీరు మున్నీరయ్యాడు. సూర్యాజీ శివాజీకి అండగా ఉంటామన్నాడు. సూర్యాజీ భ్రాతృభక్తికి, ప్రభుభక్తికి సంతోషించి శివాజీ అతనిని ప్రస్తుతించాడు.
శివాజీ తల్లిదండ్రులైన షాజీ, జిజియా, శివాజీ భార్య సయిబాయి ఇంకా ఎందరో ఈ కావ్యంలో అడుగడుగున దేశభక్తి స్ఫూర్తి కానవస్తుంది. ‘‘శివభారత’’ కావ్యరచనా లక్ష్య మీ విధముగా భారత స్వాతంత్య్రోద్యమ ఫలంగా బాసిల్లినది. మరి ‘‘ ఆ మహాకవి వాక్కు ఋషి వాక్కే కదా॥ కనుకనే అది సత్యవాక్యమైంది॥
‘‘దేశభక్తుల కీర్తి వర్థిల్లు గాక!
దేశ చరితలు రక్తి సంధించుగాక!
కవుల కెందును విజయము కలుగు గాక!
నీదయ భవాని। యమృతమై నెగడు గాక!!’’ (శివభారతం- 8- 238)
ఆధార గ్రంధాలు:
- ‘‘ శ్రీ శివభారతము ’’ - గడియారం వెంకటశేష శాస్త్రి
- ‘‘ చత్రపతి శివాజి ’’ - జాగృతి ప్రచురణ
- ‘‘ చత్రపతి శివాజి ’’ - పి.రాజగోపాల నాయుడు